కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీవారు
CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుని రూపంలో కల్పవృక్ష వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. పురవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో కర్పూర హారతులు పట్టగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.