'పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించాలి'

'పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించాలి'

విశాఖ జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆటోనగర్, మధురవాడ ఐటీ పార్కులకు కార్మికుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని సూచించారు.