నేటి నుంచి ముఖ ఆధారిత హాజరు

నేటి నుంచి ముఖ ఆధారిత హాజరు

AKP: ఉపాధి హామీ పథకం వేతనదారులకు సోమవారం నుంచి ముఖ ఆధారిత హాజరు అమలులోకి వచ్చింది. ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు నమోదు చేశారు. మండలంలో పలు గ్రామాల్లో పనిచేస్తున్న 2,200 మందికి ముఖ ఆధారిత హాజరు వేసినట్లు ఏపీఓ ఎరకయ్య తెలిపారు. బినామీ మస్తర్లలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు.