'ఉపాధి హామీ చట్టం రక్షణకు ఐక్య పోరాటం'
VSP: గ్రామీణ ఉపాధి హామీ చట్టం రక్షణకై కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఐక్యంగా పోరాటం చేస్తాయని సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బీ.గంగారావు అన్నారు. ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్షాలతో కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన, నిరాహార దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాసినివర్మరాజు, సీపీఐ నాయకులు ఎం.పైడిరాజు పాల్గొన్నారు.