ఫోటోగ్రాఫర్ కన్నుమూత
కరీంనగర్ చింతకుంటకు చెందిన 44 ఏళ్ల ఫోటో గ్రాఫర్ దాసరి శ్రీనివాస్ అనారోగ్యంతో అకాల మరణం చెందారు. సామాజిక, సాంస్కృతిక, భక్తి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఆయన మృతి స్థానికులను కలచివేసింది. చింతకుంట ప్రజలు, యువత తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబానికి సానుభూతి తెలిపారు.