కరెంటు షాక్తో రైతు మృతి

NGKL: పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామానికి చెందిన రైతు కరెంటు షాక్తో మృతి చెందారు. గ్రామానికి చెందిన బాచారం శ్రీను విద్యుత్తులైన్కు మరమ్మతు పనులు చేస్తుండగా కరెంటు షాక్కు గురయ్యాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.