ఆశా వర్కర్ కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం
సత్యసాయి: కుమ్మరవండ్లపల్లి పంచాయతీ చర్చి వీధికి చెందిన ఆశా వర్కర్ సరస్వతి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబానికి వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆర్థిక సాయం అందించారు. మరణవార్త తెలిసిన వెంటనే స్పందించిన ఆయన, తన తండ్రి మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ ద్వారా దహన సంస్కారాల కోసం రూ. 10,000 నగదును అందజేశారు.