12కి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య

12కి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరితో పాటు మరో ముగ్గురు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.