నల్లగొండ రాయుడు స్వామి ఉత్సవాలకు విరాళం
SS: ధర్మవరం మండలం రేగాటిపల్లెలో వెలసిన నల్లగొండ రాయుడు స్వామి జోతుల బాణాల కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఆయన తన వంతుగా రూ. 20 వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.