'రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం'

NLG: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి ఇంద్ర ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.