బాలానగర్లో నగదు పట్టివేత
MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం ఎస్ఎస్టీ టీమ్, పోలీసులు 44వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఒక బొలెరో వాహనంలో రూ.3 లక్షల నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే పత్రాలు తప్పనిసరి అని అధికారులు తెలిపారు.