శ్రీమత్ భాగవతం ప్రవచనంలో రాధా తత్త్వ వివరణ
VSP: భాగవతంలో రాధా దేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి గూఢనాయకి అని వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. ఋషి పీఠం, సత్సంగం ఆధ్వర్యంలో విశాఖ ఎంవీపీ కాలనీ ఏబీసీ పార్కులో జరుగుతున్న 14 రోజుల శ్రీమద్భాగవత ప్రవచన యజ్ఞం 12వ రోజు సోమవారం ఆయన ఉపన్యాసం చేశారు. రాసలీల, యోగలీల వంటి దివ్య తత్త్వాలను అర్థం చేసుకోవడం భగవదానుగ్రహం పొందినవారికే సాధ్యమన్నారు.