'ఈ-పాస్ లింకుతో నిత్యవసర సరుకులు సరఫరా చేయాలి'
VZM: ఈ-పాస్ లింకుతో నిత్యవసర సరుకులు సరఫరా చేయాలని గజపతినగరం మండలంలోని రేషన్ డిపో డీలర్లు గురువారం గజపతి నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో హెచ్డీటీ, సీఎస్డీటీలకు అందజేసిన వినతి పత్రంలో కోరారు. ఈ-పాస్ మిషన్కి కాటాకు లింకుతో ప్రజలకు సరుకులు సరఫరా చేస్తున్నామని తమకు అలాగే అందించాలన్నారు. యూనియన్ నుంచి సమాచారం వచ్చేవరకు సరుకులు విడుదల చేయరాదన్నారు.