తప్పిపోయిన బాలుడు.. గంటల్లో తల్లి చెంతకు
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు తప్పిపోయినట్లు తల్లి యశోద ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై అనిల్ కుమార్ తక్షణమే చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే బాలుడిని గుర్తించి తల్లి చెంతకు చేర్చారు. వెంటనే స్పందించిన పోలీసులకు యశోద కృతజ్ఞతలు తెలిపారు.