జంట హత్యల ఘటనను పరిశీలించిన ఎస్పీ
NLR: కొడవలూరు (మం) గండవరం పొలాల సమీపంలో జంట హత్యల ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల అడిషనల్ ఎస్పీ సౌజన్యతో కలిసి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు, పోలీసు సిబ్బందిని హత్యలు జరిగిన విధానంపై ఆరా తీశారు. ఏ ఒక్క ఆధారం వదలకుండా కేసును త్వరితగతిన చేధించాలని సిబ్బందికి సూచించారు.