VIDEO: 'ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి'
SRD: ప్రభుత్వం రూపొందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరేలా సర్పంచులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం కందిలోని కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని సర్పంచులకు, కౌన్సిలర్లకు సమావేశపరిచి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏప్రిల్ 2న గ్రామసభ నిర్వహించి విద్యా, వైద్యం తదితర స్కీములపై ప్రజలకు తెలపాలన్నారు.