VIDEO: వైభవంగా వన దుర్గమ్మకు త్రయోదశి పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి శివారులోని శ్రీ రాజగోపురం వద్ద వన దుర్గమ్మకు సోమవారం త్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కార్తీకమాసం శుక్లపక్షం ఇందు వాసరే పురస్కరించుకుని పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి మంగళహారతితో నైవేద్యం సమర్పించారు.