రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు..!

రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు..!

BDK: రాష్ట్ర వ్యాప్తం‌గా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న మూడు రోజుల్లో ఇవి మరో 1 నుంచి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడ గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖమ్మం, మెదక్, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి.