వృద్ధురాలిపై చాకుతో బెదిరించి దోపిడీ

వృద్ధురాలిపై చాకుతో బెదిరించి  దోపిడీ

కృష్ణా: చల్లపల్లి (M)లోని లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో మంగళవారం దోపిడీ కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 78 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వంటగదిలోకి చొరబడ్డారు. చాకుతో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.