'సమస్యను చట్టపరంగా పరిష్కరించాలి'
NDL: డోన్ జంగాల కాలనీకి చెందిన ఈభూది లక్ష్మికి చెందిన ఆస్తిని మరిదికి రాసివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని మహిళా సంఘం నాయకురాలు పట్నం రాజేశ్వరి మండిపడ్డారు. మరిది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. భార్యా భర్తల మధ్య ఆస్తి విషయంలో మరిది లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఎటువంటి హక్కు లేదన్నారు. సమస్యను చట్టపరంగా పరిష్కరించాలన్నారు.