హనుమాన్ ఆలయానికి విరాళం అందజేత
NRML: బాసర సమీపంలోని రేణుకపూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ అధ్యక్షుడు సంజీవరావు దేశ్ముఖ్ గురువారం రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గురుస్వామికి అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.