కశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన ముస్లిం సంఘాలు

GNTR: తెనాలిలోని జామియా మసీదు వద్ద జమాయతే ఉలమా హింద్ నేతలు గురువారం సమావేశం అయ్యారు. కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ముస్లిం సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు చాలా బాధాకరం అని, ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని పేర్కొన్నారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని చెప్పారు.