గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్

VZM: ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను విజయనగరం 1వ పట్టణ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 49.147 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ.650 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.