ఘనంగా మైసమ్మ తల్లి వార్షికోత్సవం

ఘనంగా మైసమ్మ తల్లి వార్షికోత్సవం

AKP: నాతవరం మండలం వైబీ.అగ్రహారం గ్రామంలో శ్రీ మైసమ్మతల్లి 4వ వార్షికోత్సవంను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కోసూరి విజయ, బుజ్జి దంపతుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న అన్నసమారాధన ఏర్పాటు చేశామని ధర్మకర్త తెలిపారు.