'రాజ్యసభలో ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించాలి'
HYD: రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలు అందించి, రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.