సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

SKLM: ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటిస్తూ, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మందస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మద్దిల సంపత్ రావు సూచించారు. శుక్రవారం మందస పీహెచ్సీలో సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని ఏఎన్ఎంలు, ఆశాలకు సూచించారు. గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.