వైసీపీని వీడి టీడీపీలో చేరిన 15 కుటుంబాలు
ప్రకాశం: పామూరు మండలం నర్రమారెళ్ల పంచాయతీకి చెందిన 15 కుటుంబాలు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.