పరిశ్రమను తక్షణమే తెరవాలంటూ డిమాండ్

పరిశ్రమను తక్షణమే తెరవాలంటూ డిమాండ్

VZM: కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెంలో మూతపడిన జిందాల్ పరిశ్రమను వెంటనే తెరవాలని టీ.ఎన్.టీ.యూ.సీ అధ్యక్షులు లెంక శ్రీను ఆదివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  6నెలలుగా మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని, ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం, కార్మిక సంఘాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోయిందన్నారు.