మత్స్యకారుల అభివృద్ధికి నిధులు మంజూరు: మంత్రి
MBNR: మత్స్యకారుల అభివృద్ధికి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.123 కోట్లు మంజూరు చేశారని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ హన్వాడ మండలం వేమసముద్రం చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకార కుటుంబానికి చెందిన నన్ను ముఖ్య మంత్రి అదే శాఖకు మంత్రిగా చేశారన్నారు.