అభివృద్ధి నిరంతర ప్రక్రియ
JGL: అభివృద్ధి నిరంతర ప్రక్రియని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 21వ వార్డులో రూ.15 లక్షలతో, 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం వద్ద రూ.4 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను డీసీసీ అధ్యక్షుడు నందయ్య శాలువాతో సత్కరించారు.