'విద్యార్థి జీవితంలో 10వ తరగతి కీలకం'
SRPT: పదవ తరగతి వార్షిక పరీక్షలకు ప్రణాళిక ప్రకారం మంచిగా చదివి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థులకి సూచించారు. గురువారం నాగారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధిస్తేనే భవిష్యత్ బాగుంటుందని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు.