ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు రన్‌వే 28 దగ్గర అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్, సిబ్బంది విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.