రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి సమస్యల పరిష్కారం గురించి తెలుసుకోవాలని కోరారు.