వైభవంగా శ్రీవారి పుష్పయాగం
TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామివారి వైభవం మరింత పెరిగింది.