స్కూల్ బస్సు, ఆటో ఢీ.. ఒకరు మృతి
TPT: చంద్రగిరి బైపాస్ రోడ్డులో శనివారం స్కూల్ బస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా పులిచెర్ల మండలం పుచ్చలవారిపల్లికి చెందిన చంద్రబాబు తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.