VIDEO: పెరిగిన నాన్ ఏసీ మిర్చి.. స్థిరంగా ఏసీ మిర్చి, పత్తి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్ కమిటీ సభ్యుల వివరాల ప్రకారం.. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,400, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.10,000, క్వింటా పత్తి ధర రూ.7,700 జెండా పాట పలికాయి. నిన్నటితో పోలిస్తే.. నాన్ ఏసీ మిర్చి రూ.900 పెరగగా.. అటు, ఏసీ మిర్చి, పత్తి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.