'ఆదివాసుల ఆత్మగౌరవ ప్రతీక బిర్సా ముండా'

'ఆదివాసుల ఆత్మగౌరవ ప్రతీక బిర్సా ముండా'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ MRO మణిధర్ ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  అనంతరం వారు మాట్లాడుతూ..1875 నవంబర్ 15న జార్ఖండ్ ప్రాంతంలో ఉలిహాట్ ప్రాంతంలో బిర్సా ముండా జన్మించారన్నారు. 1894లో ఆంగ్లేయులు, దోపిడీ దారులకు వ్యతిరేకంగా పోరాడి గిరిజన సింహ స్వప్నంగా, ఆదివాసుల ఆత్మగౌరవ ప్రతీక బిర్సా ముండా అని కొనియాడారు.