యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయం రూ.29.46 లక్షలు
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు శనివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,64,100, బ్రేక్ దర్శనాలతో రూ.2,15,400, వ్రతాలతో రూ.2,98,000, VIP దర్శనాలతో రూ.3,90,000, కార్ పార్కింగ్ రూ.5,62,000, ప్రసాద విక్రయాలతో రూ.9,31,620, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.29,46,410 ఆదాయం వచ్చినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు.