కేసీ కెనాల్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పరిధిలోని కేసీ కెనాల్లో ఆదివారం గల్లంతైన ఒంగోలుకు చెందిన హేమంత్ (17) మృతదేహం సోమవారం ఈర్నపాడు సమీపంలో లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది డ్రోన్ సాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.