ఈనెల 14న జాబ్ మేళా

కర్నూలు బి. క్యాంపులోని డాక్టర్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 14న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ బుధవారం తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 11 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.