నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు
WNP: ఆత్మకూరు మండలం కత్తెపల్లె గ్రామంలో ఆదివారం నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒక ప్రదేశంలో కొంతకాలంగా చీకటిగా ఉండడంతో నూతన స్తంభాలు ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి నూతన స్తంభాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామస్థులు సర్పంచ్కు అభినందనలు తెలిపారు.