విజయవాడలో లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు

విజయవాడలో లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు

కృష్ణా: విజయవాడ 3టౌన్ పరిధిలోని లాడ్జీల్లో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లాడ్జీల నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన సీఐ నాగమురళి, బస చేసే వారి గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి గదులు కేటాయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.