సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్తో కలిసి కోహ్లీ 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక సార్లు (32) 150 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ (31) పేరిట ఉండేది.