జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రుల సమావేశం
GNTR: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం ఆరోగ్య, ఆయుష్ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్తో చర్చించారు. గుంటూరు జిల్లా నడింపాలెంలో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి, సెంట్రల్ యోగా, నేచురోపతి ఇన్స్టిట్యూట్ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏపీ ప్రజలకు ఆధునిక ఆరోగ్య సేవలు అందుతాయని వివరించారు.