ఓయూలో జరిగే కార్యక్రమానికి సీఎంకు ఆహ్వానం

HYD: సీఎం రేవంత్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఫ్రొ.కాశీం ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 21న ఓయూలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎంను ఆహ్వానించారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 హాస్టల్స్ ప్రారంభం కార్యక్రమానికి రావలసిందిగా సీఎంకు విజ్ఞప్తి చేశారు.