'రెండు ప్రధాన రైల్వే లైన్‌లను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారు'

'రెండు ప్రధాన రైల్వే లైన్‌లను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారు'

KNR: రెండు ప్రధాన రైల్వే లైన్లను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. 'ఆదిలాబాద్‌కు రైలులో వెళ్ళాలంటే మహారాష్ట్రకు వెళ్ళి మళ్లీ ఆదిలాబాద్‌కు వెళ్ళాలి. నిజాం కాలం నాటి రైల్వే లైన్ ఇప్పటికీ ఉంది. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్‌కు వచ్చే విధంగా సర్వే, DPR రెడీ చేయించాను' అని అన్నారు.