కూటమి సర్కార్కు షాక్..విద్యుత్ ఉద్యోగుల సమ్మె
KDP: విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.