త్రాగు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు

త్రాగు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు

NRML: కడెం మండలం బెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా మంజూరైన నిధులతో మంచి నీటి బోరు వెల్ ఏర్పాటు పనులకు శుక్రవారం సర్పంచ్ బొంతల లక్ష్మీ, భూమన్న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా బోరు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనూష ఉన్నారు.