మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని డిమాండ్
SRD: జహీరాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలపై కౌన్సిలర్ అప్పం శ్రావణ్ కుమార్ గళమెత్తారు. పట్టణంలో కార్మికుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్లో ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.