ఆదోనిలో ఘనంగా బీజేపీ జెండా ఆవిష్కరణ

ఆదోనిలో ఘనంగా బీజేపీ జెండా ఆవిష్కరణ

KRNL: ఆదోని పట్టణంలోని 35వ వార్డులో మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ స్థాపించి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యేగా పార్థసారథి గెలిచిన వెంటనే నియోజకవర్గంలో రూ. 10 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహబూబ్, మధుసూదన శర్మ, తదితరులు పాల్గొన్నారు.